గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు.

గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు. సహచరులు గమనించి చెట్టు ఎక్కి చూడగా అప్పటికే ఆయన ప్రాణాలు వదిలారు. తాడు కట్టి రమణ మృతదేహాన్ని చెట్టు పైనుంచి దింపారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారా లేక పాము ఏదైనా కాటేసిందా అన్నది తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లా భీమిలి మండలం సింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేటలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





