గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు.

గీత కార్మికుడు బాడిదబోయిన రమణ (52) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కారు. ఏమైందో ఏమో కాసేపటికే చెట్టుపై వేలాడుతూ కనిపించారు. సహచరులు గమనించి చెట్టు ఎక్కి చూడగా అప్పటికే ఆయన ప్రాణాలు వదిలారు. తాడు కట్టి రమణ మృతదేహాన్ని చెట్టు పైనుంచి దింపారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారా లేక పాము ఏదైనా కాటేసిందా అన్నది తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లా భీమిలి మండలం సింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేటలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





