కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం అర్థరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను బంగారం, డబ్బు ఇవ్వకుంటే పొడిచి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అడ్డుకున్న రాఘవరెడ్డి భార్య, కూతురిపై దాడికి దిగారు.
70 తులాల బంగారంతో
అనంతరం ఇంట్లో ఉన్న దాదాపు 70 తులాల బంగారంతో పాటుగా రూ.8 లక్షల డబ్బును దోచుకెళ్లారు. గాయపడిన రాఘవరెడ్డి బార్యను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. రాఘవరెడ్డి కూతురు ఇటీవలే అమెరికా నుంచి వచ్చింది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





