కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని గాంధీనగర్లో పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగలి దుర్గానందరావు ఇంటి ముందున్న షెడ్డులో.. 35 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 17.49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
గొల్లప్రోలు,: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని గాంధీనగర్ లో పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మొగలి దుర్గానందరావు ఇంటి ముందున్న షెడ్డులో.. 35 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 17.49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలుకు చెందిన సిరిపిరెడ్డి వీరభద్రరావు ఆ బియ్యాన్ని స్థానికుల నుంచి సేకరించారు. ఉప తహసీల్దారు భారతి ఫిర్యాదుతో బాధ్యులైన దుర్గానందరావు, వీరభద్రరావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ బియ్యాన్ని పిఠాపురంలోని గోదాముకు తరలించినట్లు ఆస్ఐ బాలకృష్ణ పేర్కొన్నారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు