అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం అనే ఉద్యోగి ఆర్డీవో కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్ రూమ్ గా వాడుకుంటున్నాడు.
ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకొని పడకేస్తున్నాడు .
అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంతవరకే ఇక్కడ ఉండాలంటూ హూకూం జారీ చేస్తున్నాడు.
గతంలో కూడా ఇక్కడ ఓ ఉద్యోగిని డిప్టేషన్ కూడా పంపించినట్టు సమాచారం మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపి వేస్తానంటూ కాంట్రాక్టు ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీంతో పై అధికారి కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో మంచమేసి పడుకుంటున్న అధికారి పై స్పందించాల్సిన ఆర్డీవో కూడా మీడియా వారు వీడియో చిత్రికించారని మీడియా వారిపై కూడా కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడు.
అదేవిధంగా నా అనుమతి లేకుండా ఆర్డిఓ చుట్టుపక్కలకు వచ్చిన విలేకరులును నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విలేకరులు బెదిరిస్తున్నాడు.
ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటు ఉండడం పై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది .
ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రజల కార్యాలయాన్ని తన సొంత ఇంటికా వాడుకుంటున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ అధికారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





