నంద్యాల అర్బన్ : కారులోని ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువకుడిని చితకబాది, యువతీయువకుడి వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని దోచుకొని పరారైన ఘటన బుధవారం నంద్యాల శివారులో జరిగింది. నంద్యాల శివారులో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వెంచర్ల లో ఆగి ఉన్న కారులోని యువతి, యువకుడి పై ముఖాలను కప్పుకున్న దుండగులు దాడి చేశారు. కారు అద్దాలపై రాళ్ళు విసిరి ధ్వంసం చేశారు. యువకుడిని విచక్షణారహితంగా కొట్టి డబ్బు, పక్కనే ఉన్న యువతి మెడ లోని గొలుసు లాక్కొని ఉడాయించారు. యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలానికి డీఎస్పీ జావలి ఆల్ఫోన్సా (ఐపీఎస్) క్లూస్ టీం వెళ్లి పరిశీలించింది. దారి దోపిడీ దొంగల పనా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో నంద్యాల తాలుక పోలీసులు విచారణ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బఅందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. ఇటీవలే శాంతి రాం హాస్పిటల్ వద్ద హైవే కు ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు లో బైక్ పై వెళుతున్న వృద్ధ దంపతులపై దాడి తరహాలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం
Also read
- India Pak War Live: జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత
- జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత.. డ్రోన్ దాడులకు పాక్ యత్నం
- ఇస్రో కేంద్రాల వద్ద హై అలెర్ట్.. పాక్ దాడుల నేపథ్యంలో శ్రీహరి కోట భద్రత కట్టుదిట్టం.
- Tirumala Temple: తిరుమలలో హై అలెర్ట్.. టెంపుల్ టౌన్ లో ఏరియా డామినేషన్ పై ఫోకస్.
- 400 టర్కిష్ డ్రోన్లతో భారత్పై దాడి! ఆ డ్రోన్లు పాక్కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్? పూర్తి వివరాలు