నంద్యాల అర్బన్ : కారులోని ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువకుడిని చితకబాది, యువతీయువకుడి వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని దోచుకొని పరారైన ఘటన బుధవారం నంద్యాల శివారులో జరిగింది. నంద్యాల శివారులో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో వెంచర్ల లో ఆగి ఉన్న కారులోని యువతి, యువకుడి పై ముఖాలను కప్పుకున్న దుండగులు దాడి చేశారు. కారు అద్దాలపై రాళ్ళు విసిరి ధ్వంసం చేశారు. యువకుడిని విచక్షణారహితంగా కొట్టి డబ్బు, పక్కనే ఉన్న యువతి మెడ లోని గొలుసు లాక్కొని ఉడాయించారు. యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలానికి డీఎస్పీ జావలి ఆల్ఫోన్సా (ఐపీఎస్) క్లూస్ టీం వెళ్లి పరిశీలించింది. దారి దోపిడీ దొంగల పనా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో నంద్యాల తాలుక పోలీసులు విచారణ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బఅందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. ఇటీవలే శాంతి రాం హాస్పిటల్ వద్ద హైవే కు ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు లో బైక్ పై వెళుతున్న వృద్ధ దంపతులపై దాడి తరహాలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





