సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణను బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Suryapet Incident: సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే కెనాల్ కట్టపై పై కృష్ణ మృతదేహం లభ్యమైంది. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరువు హత్య..
కృష్ణ ఆరునెలల క్రితం కృష్ణ భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో భార్గవి సోదరుడు కృష్ణ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మరోవైపు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ హఠాత్తుగా హత్యకు గురికావడం మరో అనుమానానికి తెరలేపింది. దీంతో కృష్ణది పరువు హత్యనా? లేదా పాత కక్షలే కారణమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





