తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలు నగ్నంగా డ్యాన్స్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ నిర్వహించాని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.
Also Read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





