పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం :
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం , స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ వాసు శర్మ ఆధ్వర్యం లో వాసుకి రవి సోమేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం , నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు . ఈ కార్యక్రమం లో మానవహక్కులు సామాజిక న్యాయం వైస్ ప్రెసిడెంట్ , BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ , ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ , దేవాదాయశాఖ అధికారి సాయి ప్రసాద్ , భక్తులు పాల్గొన్నారు.
Also read
- ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!
- ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!
- 2026 ఉగాది పంచాంగం.. వృషభ రాశి వారికి రాజయోగమే!
- 2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!
- అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..




