పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం :
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం , స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ వాసు శర్మ ఆధ్వర్యం లో వాసుకి రవి సోమేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం , నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు . ఈ కార్యక్రమం లో మానవహక్కులు సామాజిక న్యాయం వైస్ ప్రెసిడెంట్ , BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ , ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ , దేవాదాయశాఖ అధికారి సాయి ప్రసాద్ , భక్తులు పాల్గొన్నారు.
Also read
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”