పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం : 
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది.  సోమవారం  ,  స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ  వాసు శర్మ  ఆధ్వర్యం లో   వాసుకి రవి సోమేశ్వర స్వామి  కి  ఏకాదశ  రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం ,  నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు .  ఈ కార్యక్రమం లో   మానవహక్కులు సామాజిక న్యాయం   వైస్ ప్రెసిడెంట్  ,  BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ ,  ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు  వేమూరి ఫణీంద్ర శర్మ ,  దేవాదాయశాఖ అధికారి  సాయి ప్రసాద్ ,  భక్తులు పాల్గొన్నారు.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





