అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు హల్చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ 12 అడుగుల భారీ గిరినాగు రైతు పొలంలో తిష్ట వేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసింది. ఇదంతా చూసిన అక్కడి వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయంతో వణికిపోయారు.
వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు స్నేక్ క్యాచర్ను పిలిపించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




