విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూల్కి వెళ్లిన బాలుడు లంచ్టైమ్లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీ తింటున్నాడు..ఈ క్రమంలోనే చపాతీ రోల్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థపడ్డాడు.
గొంతులో చేప ముల్లు, కోడిగుడ్డు, మటన్ బొక్కలు ఇరుక్కుని పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం చూశాం. అయితే, ఓ 12ఏళ్ల బాలుడు గొంతులో చపాతీ ఇరుక్కుని మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూల్కి వెళ్లిన బాలుడు లంచ్టైమ్లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీ తింటున్నాడు..ఈ క్రమంలోనే చపాతీ రోల్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థపడ్డాడు.
బాలుడి అవస్థ చూసిన తోటి విద్యార్థులు వెంటనే టీచర్లు, సిబ్బందికి తెలియజేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025