వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని.. తనకు ఏపార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఇక జీవితంలో ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని తెలిపారు. ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడనని పోసాని కృష్ణమురళీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్దిరోజులుగా ఆయనపై ఏపీవ్యాప్తంగా కూటమి నేతలు కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. కాగా, పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్గా పని చేశారు.
Also Read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





