విజయనగరం : విజయనగరంలోని కాటవీధి బీసీ హాస్టల్ కు చెందిన విద్యార్థి కొణతాల శ్యామలరావు ఆదివారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన శ్యామల రావు ఉదయం కళ్ళు తిరుగుతున్నాయని పడిపోవడంతో హాస్టల్ వార్డెన్ జానకిరామ్ జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు తనిఖీ చేసి విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యులు మాత్రం మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్ది చనిపోవడం చూసి బోరున విలపిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారి యశోధనరావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వార్డెన్ తో మాట్లాడి ఎలా జరిగిందో ఆరా తీశారు. వెంటనే జిల్లా కలెక్టరుకి, పోలీస్ వారికి సమాచారం అందించారు.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





