మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్రావుల ఫొటోను అభ్యంతరకరంగా వైరల్ చేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్రావుల ఫొటోను అభ్యంతరకరంగా వైరల్ చేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వ్యాపారి మహేశ్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోని సురేఖ, రఘునందన్రావుల ఫొటోను కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీ ఈ నెల 3న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా కొందరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Also read
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..
- పెళ్లి చేస్తామంటూ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్కు పిలిచిన అమ్మాయి తండ్రి.. ఇంతలోనే షాక్!
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం





