మంచిర్యాల జిల్లా బొత్తపల్లిలో విషాదం చోటుచేకుంది. దసరా పండగ సందర్భంగా గ్రామంలో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య(42) కోడి కాలికి కత్తి కడుతుండగా పొరపాటున కత్తి మోచేతికి తగిలి.. నరం తెగడంతో ప్రాణాలు కోల్పోయాడు.
కోడి కాలికి కట్టిన కత్తి ఓ మనిషి ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా కన్నెప్పల్లి మండలం బొత్తపల్లిలో గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రాణం తీసిన కోడి కత్తి అయితే బొత్తపల్లిలో గ్రామంలో దసరా పండగ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో కోడి పందేలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మదనయ్య (42) కోడి కాలికి కత్తి కడుతుండగా అది ఒక్కసారిగా పైకి ఎగిరింది. దీంతో కోడి కాలికి కట్టిన కత్తి కాస్త అతని మోచేతికి తగిలి నరం తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే మదనయ్య ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరీశీలించారు
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





