మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

రామాయంపేట: మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్యాగల ముత్తవ్వ ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాల నెపంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విని స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి
పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..