పల్నాడు జిల్లా (నరసరావుపేట) : వసతిగృహంలో 9వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం హార్డ్ హైస్కూల్ లో చదువుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన 9 వ తరగతి విద్యార్థిని పల్లపు జయలక్ష్మి (14) వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2వ పట్టణ పోలీసులు వసతి గృహానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పెదయలమంద, సుబ్బమ్మల ఫిర్యాదు మేరకు నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




