చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అనంతరం తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు.
కుప్పంపట్టణం : చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత వీరంగం సృష్టించారు. అనంతరం తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని మునిస్వామిపురం కాలనీలో కుప్పం మున్సిపల్ తెదేపా అధ్యక్షుడు రాజ్కుమార్ సోదరుడు వినయ్ పై వైకాపాకు చెందిన ఓ నాయకుడి ఇద్దరు కుమారులు తమ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వినయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 12న గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వెలుగు చూసింది. వినయ్ తోపాటు తెదేపా కార్యకర్తలు, మరో వ్యక్తిపై నలుగురు యువకులు దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి వారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు నమోదైన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా ప్రయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన యువకులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?





