ఈ రోజుల్లో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న విషయాలలో గొడవ పడి హత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. చిన్నపాటి ఘర్షణలు హత్యల వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇక్కడ బిర్యానీ ఇప్పటించలేదనే కారణంతో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. స్థానికంగా సేకరించిన సమాచారం మేరకు.. గొల్లపూడి..
ఈ రోజుల్లో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణమైపోతున్నాయి. చిన్న విషయాలలో గొడవ పడి హత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. చిన్నపాటి ఘర్షణలు హత్యల వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇక్కడ బిర్యానీ ఇప్పటించలేదనే కారణంతో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. స్థానికంగా సేకరించిన సమాచారం మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిర్యానీ అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని అన్న చెప్పడంతో తమ్ముడు తీవ్ర అవేశానికి గురయ్యాడు.
దీంతో బిర్యానీని ఇప్పించలేదనే కోపంతో తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాము ఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కె ఉమామహేశ్వర రావు తన సిబ్బందితో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హత్య చేసిన తమ్ముడు లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బిర్యానీ ఇప్పించలేదని అన్నను తమ్ముడు హతమార్చాడా లేక మరే ఇతర కారణాల వల్ల ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
Also read
- పెళ్లి అయినా తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
- Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల…లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
- వస్తున్నాయ్ ఫీలింగ్స్!
- నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?





