సెల్ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం దుండిగల్ తండాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్: సెల్ఫోన్ ఛార్జర్ కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ పరిధిలోని దుండిగల్ తండాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండా2లో శాంత (50) అనే మహిళ పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ జీవనం సాగించేది. శుక్రవారం దుకాణం పక్కనే ఆమె విగతజీవిగా పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసినట్లు అనుమానించి, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ పుటేజీ ఆధారంగా రావుల కమల్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తొలుత నిందితుడు మొబైల్ ఛార్జర్ కోసం శాంతతో గొడవ పడ్డాడు. ఆమె అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో వెనక్కి నెట్టేశాడు. ఆమె వీపుభాగంలో బలంగా గాయమైంది. కేకలు పెడుతోందని భయపడి ఆమెకు ఊపిరి ఆడకుండా ముక్కు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. నేరం అంగీకరించిన అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..