అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మతు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా వైర్లు కాలిపోయి మెకానిక్కు గాయాలయ్యాయి.
చింతపల్లి: అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మతు పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా కరెంటు తీగలు కాలిపోయి దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో రోగులంతా భయంతో బయటకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.
ఆదివారం ఉదయం నుంచి ఈ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఓ మెకానిక్ మరమ్మత్తు చేస్తుండగా వైర్లు కాలిపోయి.. అతడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అవసరమైతే విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!
- యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..!





