గుడ్లవల్లేరులోని పుల్లేరు కాలువలో స్నానం చేస్తూ ఆదివారం గల్లంతైన బాలుడి మృతదేహాన్ని ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు సోమవారం గుర్తించాయి.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నీలకం ఠేశ్వరపురానికి చెందిన కోలాజోషి(17) తన ఇంటికి సమీపంలోని పుల్లేరులో స్నానానికి దిగి లోపలికి వెళ్లి పడిపోయాడు. కాల్వలో నీరు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఇద్దరు షాంపూ కొనేందుకు వెళ్లగా ఒక్కడే స్నానం చేస్తున్నాడు. చివరి నిమిషంలో జోషి చేతులు పైకి ఎత్తడంతో సమీపంలోని వారు గుర్తించారు. అప్పటికే గల్లంతవ్వడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు.
వీఆర్వో కోటప్రోలు ప్రకాశ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుడివాడ అగ్నిమాపక సిబ్బంది, విజ యవాడ నుంచి ఏపీ ఎస్ డి ఆర్ఎఫ్ బలగాలు వచ్చి తాత్కాలిక గాలిబోట్లు, లైఫ్ జాకెట్లతో గాలింపు చేపట్టగ జోషి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు….. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Also read
- స్నానం వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఇలా చేస్తే జీవితమే మారిపోతుందట!
- ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే తిరువారూర్ ఆలయం- దర్శిస్తే దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!
- శ్రీ చక్రం ఆకారంలో “దేవీ ఆలయం” – మహిళలే “పూజారులు”!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఏసీబీ వలలో జలమండలి తిమింగలం.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు.. విస్తుపోయే ఆస్తులు!




