సాగర్ కాలువలో ఈతకి వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా దర్శి నాగర్జున సాగర్ బ్రాంచ్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన మూడు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి, కొర్లమడుగు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ముగ్గురు స్నేహితులు సరదాగా ఈతకు వెళ్లి సాగర్ కాలువలో గల్లంతయ్యారు. వారిలో కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేష్ రెడ్డి (19) మృతదేహం లభ్యం కాగా.. గల్లంతయిన మరో ఇద్దరు యువకులు కొర్లమడుగు,లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కుందూరు కిరణ్ కుమార్ రెడ్డి (19)బత్తుల మణికంఠ రెడ్డి (19)గా స్థానికులు గుర్తించారు.
గల్లంతైన ముగ్గురు విద్యార్థులు దర్శిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు మృతుల బంధువులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా కానరాని లోకాలకు వెళ్ళటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనతో మృతుల గ్రామాల్లోని బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న దర్శి డిఎస్పి, సీఐ, ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గల్లంతైన మిగతా ఇద్దరి కోసం గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్కు తీసుకెళ్లి..





