దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
నాగపూర్ : దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల ఆకాశ్ చకోలే ఆగస్టు 15న స్నేహితులతో కలిసి మకర్తోక్గా డ్యామ్కు వెళ్లాడు. వర్షాల కారణంగా డ్యామ్ నిండి అలుగు పారుతోంది. దీంతో పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆకాశ్ తనతోపాటు వచ్చిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర విన్యాసానికి ప్రయత్నించాడు. ముగ్గురూ డ్యాం గోడను ఎక్కే ప్రయత్నం చేశారు. వారిలో ఆకాశ్ ఒక్కడే గోడపైకి చేరగలిగాడు. నీటి లీకేజీ కారణంగా జారుతుండటంతో ప్రమాదం శంకించిన మిగతా ఇద్దరూ ఆకాశ్ను కిందకు లాగేందుకు చేయందించారు. గోడపై చేరిన ఆనందంలో చేతులు ఊపిన ఆకాశ్ ప్రమాదవశాత్తూ పట్టు కోల్పోయి వెనుక ఉన్న డ్యామ్లో పడిపోయాడు. రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని బయటకు తీశాయి.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





