అది శ్రీరాముని ఆలయం.. భక్తులంతా శ్రావణమాస పూజల్లో నిమగ్నమయ్యారు. పూజారి కూడా సీతారాములకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అందరూ ఉరుకులు.. పరుగులు తీశారు. హడావుడి మొదలైంది. కట్ చేస్తే.. అసలు విషయం తెలిసి, పూజారి సైతం పరుగు అందుకున్నారు. తీరా చూస్తే, నాగు పాము కలకలం రేపింది. భుసలు కొడుతూ హడలెత్తించింది. విశాఖ మల్కాపురం శ్రీరాముని ఆలయంలో భక్తుల హడావుడితో పడగ విప్పి హల్చల్ చేసింది ఆరడుగుల నాగు పాము. దీంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. చాకచక్యంగా పామును బంధించి, నగర శివారు లో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
- యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
- మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి





