తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయిన తనయుడి గుండె బరువెక్కింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొద్దిసేపటికే తనయుడు కూడా గుండెపోటుతో తనువు చాలించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో జరిగింది.
పెద్దంపేట గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మయ్య (62) అనే వ్యక్తి సోమవారం(ఆగస్ట్ 12) ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మృతితో తల్లడిల్లిపోయిన పెద్దకుమారుడు కృష్ణరాజు(30) రోదిస్తూనే తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. సాయంత్రం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు కృష్ణరాజు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోడం ఇబ్బందిగా ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణరాజు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి కన్నీరుమున్నీరైంది. మృతులు ఇద్దరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తు జీవిస్తుంటారు. తండ్రికొడుకుల మృత్యువాతతో పెద్దంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు తండ్రి కొడుకులు గుండెపోటు తో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేలా చేసింది.
Also read
- ఉగాది పండుగని ఏయే రాష్ట్రాల వారు ఎలా జరుపుకుంటారో తెలుసా? స్పెషల్ వంటకాలేంటంటే..
- మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!
- చేతిలో స్టెతస్కోప్, ఒంటి మీద డాక్టర్ కోటు.. పైకి చూసి ఏదో అనుకునేరు.. లోపల యవ్వారం.!
- అబ్బ ఏం స్కెచ్ వేశావ్రా.. సైలెంట్గా జారుకుందాం అనుకున్నాడు.. కట్చేస్తే..
- ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





