విజయవాడ లీగల్: బాలికపై మాయమాటలతో పలుమార్లు
లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె. జయలక్ష్మి తీర్పునిచ్చారు. విజయవాడ సూర్యారావుపేట పోలీసుస్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల బాలికకు తన అన్నయ్య స్నేహితుడు పరిచయమై ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిశాడు. కొద్దిరోజుల తరువాత నిన్ను ప్రేమించడం లేదని, ఈ విషయం ఎవరికైనా చెబితే ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది.
కేసు నమోదు చేసిన అప్పటి సూర్యారావుపేట మహిళా ఎస్సై జి. అనూష అనంతరం అప్పటి సౌత్ ఏసీపీ డి. పావన్ కుమార్ దర్యాప్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామానికి చెందిన కోరేపల్లి ప్రవీణ్ కుమార్ (37)ను అదుపులో తీసుకొని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికకు రూ.లక్ష నష్ట పరిహారం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు.
Also read
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
- శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026: తేదీ, శుభ ముహూర్తం, పూజ విధానం, ఉపవాసం మరియు దహీ హండి(ఉట్ల పండుగ) ప్రాముఖ్యత
- Andhra: దొంగతనానికి వచ్చాడు.. వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడగానే..





