అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిది లో చోటుచేసుకుంది. ఎస్ఐ షాహీద్ పాషా తెలిపిన మేరకు.. లాలాపేటలోని ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన మౌనిక(26)కు నాచారం లోని చిలుకనగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం మౌనిక తండ్రి తన కూతురు, అల్లుడిని ఆర్యనగర్లోని తన ఇంటికి తీసుకొచ్చాడు.
ఆల్లుడు రమేష్ రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మౌనిక స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లి బోర్కు మోటర్ ఆన్ చేసింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురై పెద్ద కేకలు వేసి పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాత్రూమ్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారికి కూడా షాక్ కొడుతుండడంతో వెంటనే మెయిన్ ఆఫ్ చేసి మౌనికను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోర్ మోటర్కు సంబంధించిన వైర్లు తెగిపోయి ఉన్నాయని, సరిగా టేప్ కూడా వేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్కు గురై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!