హైదరాబాద్: మద్యం మత్తులో సిగరెట్ తాగుతుండగా.. సోఫాకు నిప్పంటుకుని విశ్రాంత సైనిక ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన బోరబండ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సెక్టార్ ఎస్ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్ఎఫ్ నగర్ ఫేజ్-1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, పొగ తాగే అలవాటు ఉంది.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Also read
- Telangana: ఛీ.. ఛీ నువ్వేం టీచర్రా.. చదువు చెప్పడం మాని స్కూల్లో ఆవేం పనులు..
- పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ
- సోఫాకు సిగరెట్ నిప్పంటుకుని..
- వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీ!
- వార్నీ ఇదెక్కడి యవ్వారం.. వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?





