విజయవాడ: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విజయవాడ వాంబేకాలనీలోని ఏ బ్లాక్ ఘటన చోటు చేసుకుంది. గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న దోమల సంగీతరావు వాంబేకాలనీ జీ ప్లస్ -3 అపార్ట్ మెంట్ ఏ బ్లాక్ లో నివాసం ఉంటున్నాడు. గంజాయి కేసులో విచారణ చేసేందుకు నున్న గ్రామీణ పోలీసులు మధ్యాహ్నం సంగీతరావు ఇంటికి వచ్చారు. పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు భవనంపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నున్న గ్రామీణ పోలీసులే సంగీత రావుని భవనంపై నుంచి తోసేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పునకు అతన్ని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read
- Garuda Purana: షాకింగ్! మరణానికి ముందు మనిషికి ఏమి కనిపిస్తుంది? గరుడ పురాణం రహస్యాలు
- Lucky Zodiac Signs: ఏప్రిల్ నెలలో వారికి అదృష్ట దేవత కటాక్షం..! ఇందులో మీ రాశి ఉందా?
- బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ కుప్పకూలిన ప్రభుత్వ టీచర్.. అక్కడికక్కడే మృతి!
- తాగిన మైకంలో దారుణం.. భార్య పిల్లలపై దాడి.. భార్య, కొడుకు మృతి, కొన ఊపిరితో కూతురు!
- ఎంత దారుణం.. రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు.. కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట





