కమలాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల కథనం ప్రకారం..
భూపాలపల్లి: కమలాపూర్ గ్రామ శివారులోని రాంపూర్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికుల కథనం ప్రకారం.. రేగళ్ల నరేష్(30), రేగళ్ల ప్రమోద్(25), సిద్దూ అనే మరొక యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై రాంపూర్ గ్రామం వైపు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమోదన్ను చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సిద్దూ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు నరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
Also read
- కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
- Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!
- Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!
- ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!
- శని, శుక్రుల యుతి.. వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని అనూహ్య మార్పులు..!





