July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

రాజేంద్రనగర్లో విషాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి



హైదరాబాద్, : రాజేంద్రనగర్లో సోమవారం ఉదయం
విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరికి గాయాలు…

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నానిన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also read

Related posts

Share via