July 1, 2024
SGSTV NEWS
Hindu Temple History

సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే.. అందుకే అక్కడి నీళ్లు వేడిగా ఉంటాయి..



రామాయణ కావ్యం అంటే తెలియని వారు ఎవరుంటారు. మన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి సీతా కుండ్. సీత మాత ఇక్కడే అగ్నిపరీక్షకు నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి ఎక్కడ అగ్నిప్రవేశం చేసిందో అక్కడ వేడి నీటి చెరువు ఏర్పడిందని, ఈ నీళ్లు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి కారణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

సీతా కుండ్ నీళ్లు..

ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు చెరువులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు
చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది.

శాస్త్రవేత్త పరిశోధన..

శాస్త్రవేత్త పరిశోధన..

సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు, వెడల్పు 20 అడుగులు కాగా, చెరువు 12 అడుగుల లోతు ఉందని చెప్పారు. అలాగే పరీక్ష నిర్వహించి ఎనిమిది నెలల పాటు ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆయన చెప్పారు.

మాఘమాసంలో ప్రత్యేక జాతర..

ప్రజలు ఏడాది పొడవునా సీతా కుండ్‌ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. కానీ మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతా కుండ్‌లోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.

Related posts

Share via