June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

దొంగతనానికి వెళ్లి.. ఇంటి యజమానులనే ఎవరు మీరని అడిగిన దొంగ!

ఈ మధ్యకాలంలో కాలంలో దొంగతనాలు కూడా పక్క ఫ్రొపెషనల్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా దొంగలు కూడా చాలా మాస్టర్ మైండ్ తో చోరిలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్లో దొంగలు చేసే పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో దొంగతనాలు కూడా పక్క ఫ్రొపెషనల్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా దొంగలు కూడా చాలా మాస్టర్ మైండ్ తో చోరిలకు పాల్పడుతున్నారు. ఇక వారు కొంతమంది దొంగలు చోరిలకు పాల్పడే విధానం చూస్తే.. అసలు సినిమా రేంజ్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే..చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఎవరికి దొరకకుండా దొంగతనం చేసి.. మెల్లగా జారుకుంటారు. కొన్నిసార్లు అయితే పక్కనే దొరకొకుండే ఎదుటవారి జోబిలకు కన్నాలు పెడుతుంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కానీ, తాజాగా ఓ దొంగ మాత్రం చోరికి పాల్పడే విధానం చూసి ఇంటి యాజమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకి ఏం జరిగిందంటే..

సహజంగా దొంగలు అంటే ఎవరికీ తెలియకుండా వచ్చి.. దొరికినంత దోచుకొని మెల్లగా జారుకుంటారు. ఇలా చాలా ఇళ్లలోకి చొరబడి, నగలు,డబ్బులు విలువైన వస్తువులు చక్కగా ముట కట్టుకొని దర్జాగా మూడో కంటికి తెలియకుండా పారిపోతుంటారు. ఈ క్రమంలోనే ఓ దొంగ కూడా అలానే దోచుకుందాం అని ఫిక్స్ అయ్యి ఓ ఇంటికి చొరబడ్డాడు. కానీ, అంతలో ఇంటి యాజమానులు రావడంతో.. వారికే షాక్ ఇస్తూ ఎవరూ మీరు అని అడగడటంతో ఆ ఇంటి యాజమానులకి చాలా ఆశ్చర్యనికి గురి చేసింది. ఆ వివరాళ్లకి వెళ్తే.. నేరేడుచర్ల పట్టణంలో శివాలయం రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇంట్లో శుక్రవారం పట్టపగలు ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. దొంగలు ఇంట్లో ఉన్న సమయంలో యజమాని భూపాల్‌రెడ్డి, ఆయన భార్య నాగలక్ష్మి ఇంటికి వచ్చారు. ఇక వారిని చూసిన ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై పారిపోయారు.

అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన గొల్ల మహేష్‌ అనే మరో దొంగ గోడ దూకి పారిపోతుండగా భూపాల్‌రెడ్డి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వారిని తీసుకెళ్లారు. ఇకపోతే ఇంట్లోకి వచ్చిన ఇంటి యజమాని, ఆయన భార్యను మీరెవరు అని ఓ దొంగ ప్రశ్నించడంతో వారు చాలా ఆశ్చర్యనికి గురైయ్యారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న రూ.80 వేల నగదు, మూడు ఉంగరాలు, రెండు జతల చెవులదిద్దులు కలిపి రెండు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెప్పారు. అయితే దొరికిన దొంగ తాను గుంటూరు జిల్లా గురజాలలో దొంగతనం కేసులో జైలులో ఉండి ఇటీవలే విడుదలైనట్లు చెబుతున్నాడు. ఇక ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఎస్సై రవీందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు

Related posts

Share via