నిడదవోలు , నవంబర్ 10
కేవలం తవ్వుకోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే
**ఇసుక పేరు చెప్పి ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే వెంటనే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియజేయండి.
**సామాన్య ప్రజల ఇళ్లు నిర్మాణం,భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరకు ఉచిత ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
.. మంత్రి కందుల దుర్గేష్
సామాన్య ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయమని మంత్రి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
అయితే కొంతమంది అత్యాశపరులు ఇసుకను ఉచితంగా కాకుండా లాబాపేక్షతో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఇసుకకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మటానికి వీల్లేదని స్పష్టంగా చెప్తున్నామన్నారు. ఎవరైనా దానిని అతిక్రమించి ఎక్కువ ధరకు అమ్మడం, వేరే వేరే వాళ్ళు పేర్లు చెప్పిన అటువంటి మాటలు నమ్మవద్దని మంత్రి అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే.. అంటే ప్రభుత్వం ఇసుకకు ఎటువంటి ధర నిర్ణయించలేదని .. అక్కడ తవ్వుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చార్జీలకు మాత్రమేనని ఇసుక కొనుక్కునేందుకు ఎటువంటి ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక పేరు చెప్పి ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే వెంటనే పోలీసు, రెవిన్యూ సిబ్బందికి తెలియచేయండని, అవసరం మేరకు నా దృష్టికి తీసుకువచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక కార్యక్రమం అందరికీ ఉపయోగపడేలా మనందరం కలిసి బాధ్యతతో చేద్దామని మంత్రి అన్నారు. తద్వారా సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పొందాలన్న ఉచిత ఇసుక కార్యక్రమాన్ని మన అందరం కలిసి అందరికీ అందిద్దామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!