*నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతా జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు….

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం 5వ, వార్డు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి మెయిన్ బజార్ లో ఈరోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు… ప్రచారంలో ఆడపడుచులను,అన్నదమ్ములను,అవ్వ,
తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారికి గాజు గ్లాసు గుర్తుపై, పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురందేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు…

*ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారు, రంగా రమేష్ గారు, నీలం రామారావు గారు, కనుమూరి సీతారామయ్య గారు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు పాల్గొన్నారు….


Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




