గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి గురించి ఓటరు గొట్టిముక్కల సుధాకర్ స్పందించారు. తనపై చేయిచేసుకున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపను సుధాకర్ చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు సుధాకర్ ఆరోపించారు. పోలీసులు తన కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం జరిగిన దాడి గురించి పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకే వైకాపా ఎమ్మెల్యే తనపై చేయిచేసుకున్నారని తెలిపారు. తాను ప్రతిఘటించడంతో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరులు తనపై దాడి చేశారని వెల్లడించారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..