గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి గురించి ఓటరు గొట్టిముక్కల సుధాకర్ స్పందించారు. తనపై చేయిచేసుకున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపను సుధాకర్ చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని బాధితుడు సుధాకర్ ఆరోపించారు. పోలీసులు తన కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం జరిగిన దాడి గురించి పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకే వైకాపా ఎమ్మెల్యే తనపై చేయిచేసుకున్నారని తెలిపారు. తాను ప్రతిఘటించడంతో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, అనుచరులు తనపై దాడి చేశారని వెల్లడించారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..