మహబూబాబాద్ జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నాగులచవితి పర్వదినం రోజున భక్తులకు నాగన్న దర్శనం కనువిందు చేసింది. జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని శివాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అంతేకాదు..శివలింగం పైన పడగవిప్పిన నాగుపాము భక్తుల్ని ఆశీర్వదించినట్టుగా కనిపించింది. నాగులచవితి రోజున గర్భగుడిలో నాగుపాము కనిపించటం అరుదైన ఘట్టంగా భావించిన భక్తులు పరవశించి పోయారు. నాగుపాముకు దండాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలతో అర్చనలు అభిషేకాలు చేశారు.
Also read
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?
- Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
- నేటి జాతకములు…15 మార్చి, 2026
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!





