నిన్న మొన్నటి వరకూ పాములు, చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మొసళ్లు కూడా చేరాయి. నదుల్లో, చెరువుల్లో ఉండాల్సిన మొసళ్లు రోడ్డెక్కుతున్నాయి. జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వన్యప్రాణులు ఇలా ప్రజల్లోకి రావడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా పల్నాడు సిల్లాలో ఓ డంపింగ్యార్డ్లో మొసళ్లు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డంపింగ్యార్డ్లో మొసళ్లు సంచరిస్తుండగా గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసళ్లను బంధించి పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలోని కృష్టానదిలో వదిలారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!