నిన్న మొన్నటి వరకూ పాములు, చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మొసళ్లు కూడా చేరాయి. నదుల్లో, చెరువుల్లో ఉండాల్సిన మొసళ్లు రోడ్డెక్కుతున్నాయి. జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వన్యప్రాణులు ఇలా ప్రజల్లోకి రావడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా పల్నాడు సిల్లాలో ఓ డంపింగ్యార్డ్లో మొసళ్లు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డంపింగ్యార్డ్లో మొసళ్లు సంచరిస్తుండగా గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసళ్లను బంధించి పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలోని కృష్టానదిలో వదిలారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..





