మూడు టన్నుల పిడిఎస్ బియ్యం, 1600 లీటర్ల రిఫండ్ ఆయిల్, రూ.1.30 లక్షల నగదును పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో తనిఖీలు సందర్భంగా ఎఫ్.ఎస్.టి టీం వాటిని పట్టుకుంది. పిడిఎస్ బియ్యాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం ఎడవల్లి నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం సీజ్ చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్న రావులపాలెం సీ.ఐ సిహెచ్ ఆంజనేయులు. పట్టుకున్న రూ.1.30 లక్షలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని ఆ నగదును జిల్లా త్రిమేన్ కమిటీకి పంపించామని.. రిఫండ్ ఆయిల్కి సంబంధించి స్థానిక తహసిల్దార్కు సమాచారం ఇచ్చామన్నారు సి.ఐ
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో