SGSTV NEWS
CrimeTelangana

Telangana: పైకి చూసి బుద్దిమంతురాలు అనుకునేరు.. బురిడీ కొట్టించడంలో ఘటికురాలు


ఒకటి కాదు రెండు కాదు.. మాయమాటలు చెప్పి ఏకంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓ కిలాడీ లేడీ. మా డబ్బులు మాకు ఇవ్వమని బాధితులు డిమాండ్ చేయడంతో.. వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పటాన్‌చెరులో ఊహించని మోసం వెలుగు చూసింది. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి విద్య అనే మహిళ అనేక మంది మహిళలను మోసం చేసింది. తక్కువ ధరకు బంగారం, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానని వారికి మాయమాటలు చెప్పి దాదాపు రూ. 18 కోట్ల వరకు వసూలు చేసింది. మాజీ ఎమ్మెల్యే నుంచి దాదాపు 2 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని.. కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని వారిని నమ్మించింది.


వారాసిగూడలో ఉన్నప్పుడు ఈ మోసాలకు పాల్పడిన విద్య.. ఆ తరువాత తన మకాంను పటాన్ చెరుకు మార్చింది. బాధితులు బంగారం, డబ్బు గురించి అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ సమాధానం చెబుతూ వచ్చింది. ఏడాదిన్నరగా పటాన్‌చెరులో ఉంటోంది. డబ్బులు కోసం బాధితులు ఒత్తిడి చేయడంతో గురువారం వారిని పటాన్‌చెరులోని తన నివాసానికి పిలిపించి విద్య భర్త అనుచరులతో దాడి చేయించింది. విద్య, ఆమె భర్త అనుచరుల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts