మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

రామాయంపేట: మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్యాగల ముత్తవ్వ ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాల నెపంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విని స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి
పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే