జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలో సదరు దొంగ మాత్రం తనకు ఆకలి అవుతుందంటూ కేకలు వేశాడు. దాంతో ఆ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు ఓ దొంగ. అయితే రోజు మాదిరిగానే ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అలికిడి అయింది. అదే సమయంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. అలికిడి శబ్దం విన్న ఆ యువకులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని ఆ దొంగ కేకలు వేశాడు. దీంతో ఆ యువకులు వినాయక నిమజ్జనం కోసం తయారుచేసిన పులిహోరను దొంగకు తినిపించారు. దేహశుద్ధి చేసిన అనంతరం నార్కట్పల్లి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులకు అప్పగించి కటకటాలపాలు చేసినప్పటికీ.. కొడితే కొట్టారు కానీ తన ఆకలిని తీర్చారంటూ ఆ దొంగ గ్రామస్తులకు దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపాడు.
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





