జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విధి వక్రీకరించి యువకులకు దొరికాడు. ఇంకేముంది దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలో సదరు దొంగ మాత్రం తనకు ఆకలి అవుతుందంటూ కేకలు వేశాడు. దాంతో ఆ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు ఓ దొంగ. అయితే రోజు మాదిరిగానే ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అలికిడి అయింది. అదే సమయంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. అలికిడి శబ్దం విన్న ఆ యువకులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని ఆ దొంగ కేకలు వేశాడు. దీంతో ఆ యువకులు వినాయక నిమజ్జనం కోసం తయారుచేసిన పులిహోరను దొంగకు తినిపించారు. దేహశుద్ధి చేసిన అనంతరం నార్కట్పల్లి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులకు అప్పగించి కటకటాలపాలు చేసినప్పటికీ.. కొడితే కొట్టారు కానీ తన ఆకలిని తీర్చారంటూ ఆ దొంగ గ్రామస్తులకు దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపాడు.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..