SGSTV NEWS
CrimeTelangana

కామ వాంఛ తీరుస్తానంటూ మహిళ ఎర.. చిత్రహింసలకు గురిచేసి నిలువు దోపిడి..!

కామ వాంఛ తీరుస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు. ఆకర్షితులైన యువకులతో చాటింగ్‌లు చేస్తూ ముగ్గులోకి దించుతారు. మభ్యపెట్టి నిలువు దోపిడీకి పాల్పడుతారు. మహిళల పేరిట మోసాలకు పాల్పడుతున్న సంఘటన కరీంనగర్ జిల్లా మండలంలో వెలుగు చూసింది. ఈ ముఠాలోని ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చింతకుంట శాంతినగర్ ప్రాంతానికి చెందిన సరళ సందీప్ (19) మరో ఇద్దరు స్నేహితులు మల్కాపూర్ లక్ష్మిపూర్ ప్రాంతానికి చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్ (18) ఎండీ రెహాన్‌ జల్సాలకు అలవాటు పడి ఖర్చులకు డబ్బులు సరిపోక దోపిడీలకు పాల్పడేందుకు కొత్త రకం పన్నాగం పన్నారు. మహిళ పేరిట కామ వాంఛ తీరుస్తానంటూ వాట్సాప్‌లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్‌లకు స్పందించి ఆకర్షితులైన యువకులను చాటింగ్‌లతో మభ్యపెట్టి ముగ్గులోకి లాగుతారు. ఇలా చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. దోపిడీకి పాల్పడుతోంది ఈ ముఠా.

ప్రధాన నిందితుడు సరళ సందీప్ మే 6వ తేదీన తన ఫోన్ నెంబర్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబు (25) కు వాట్సాప్ లో హాయ్.. ఐయాం పూజ.. అంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ కు స్పందించి మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు చాటింగ్ ప్రారంభించాడు. కామ వాంఛ తీరుస్తానంటూ ఆశ చూపడంతో, అది నమ్మిన యువకుడు మే 11వ తేదీన కరీంనగర్‌కు చేరుకున్నాడు. తనతో చాటింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. తను కరీంనగర్ కు చేరుకున్నట్లు చెప్పాడు.

పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లి మండల కేంద్రంలో రమ్మని చెప్పారు. ఇందులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై సదరు యువకుడి వద్దకు చేరుకుని మాట్లాడుతున్నట్లు నటించారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం తాము ఎక్కడైతే దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ ప్రాంతానికి ఇందులో సభ్యుడైన ఎండీ రెహాన్ ముందే అక్కడకు వెళ్లి ఉన్నాడు. మనం వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సులు ఆటోలు ఉండవు, బైక్ పైన వెలుదామంటూ వచ్చిన యువకుడిని నమ్మించారు.

సదరు యువకుడిని బైక్‌పై ఎక్కించుకుని తాము నిర్ణయించుకున్న వెలిచాల గ్రామ శివారులోని పొలాలకు ఆనుకొని ఉన్న ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న వెంటనే మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు హరిబాబును చిత్రహింసలకు గురి చేశారు. పైగా 50 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే, చంపుతామని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన సదరు యువకుడు తన వద్ద ఉన్న 10వేల రూపాయల నగదు అందజేశాడు. బంధువులు స్నేహితులకు ఫోన్ చేసి మరో 12 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తెప్పింకుకుని ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ప్రధాన నిందితుడు సరళా సందీప్ గతంలో ఇదే తరహా దోపిడీలకు పాల్పడి వరంగల్‌లోని జువైనల్ హోమ్‌కు వెళ్లి శిక్ష అనుభవించాడు. ఈ ముగ్గురు ముఠా సభ్యుల దోపిడీకి గురైన బాధిత యువకుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపల్లి ఎస్సై ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో కనిపించిన ఇద్దరు యువకులను గుర్తించి అరెస్టు చేశారు. యువకులు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సందప్ కోసం గాలింపు చేపట్టారు.

Also read

Related posts

Share this