July 8, 2024
SGSTV NEWS
Telangana

Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకేసారి..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా వీధికుక్కలు చిన్నపిల్లలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. వీధుల్లో పిల్లలు కనబడితే చాలు, రౌండప్‌ చేసి, రక్కేస్తున్నాయి. తాజాగా… సంగారెడ్డి జిల్లా శ్రీనగర్‌ కాలనీలో కుక్కలు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పఠాన్ చెరు మండలంలో శునకాల దాడిలో ఓ బాలుడు మరణించిన సంఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది..

Also read :నల్లమల అడవిలో అనుకోని అతిథి.. చూసి షాకైన అటవీ సిబ్బంది..

సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్‌ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా ఆరు వీధి కుక్కలు ఎటాక్ చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు తరిమేందుకు ప్రయత్నించారు. రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడి నుండి తరిమేశారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేశారు.

వీడియో…:https://x.com/AduriBhanu/status/1808456296854950077?t=owpcTlhhoo60TgILK8-n2A&s=19

Also read :Andhra Pradesh: ఎందుకిలా చేశారమ్మా.. ఒకే కుటుంబం.. ఇద్దరు బాలికలు.. ఒకేసారి..

ఆళ్లగడ్డలో మరోసారి తెరపైకి ఫ్యాక్షన్.. స్థానికులలో టెన్షన్.. అప్రమత్తమైన పోలీసులు..

ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!

Related posts

Share via