తెలంగాణ రాజ్భవన్లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
TG RajBhavan: తెలంగాణ రాజ్భవన్లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. సీసీ రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓ గదిలో ఈ చోరీ జరిగగా.. దుండగులు హెల్మెట్తో కంప్యూటర్ రూమ్లోకి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఉత్కంఠగా మారింది. తెలిసిన వారే చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఈ హార్డ్డిస్క్ల్లో రాజ్భవన్లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డేటా మాయం మాయమైతే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!