October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా..

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది.

Also read :నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. డిన్నర్ తర్వాత బస్సును తోటి డ్రైవర్‌కు అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం చేరవేసిందని తెలియగానే కృష్ణ బస్సు దిగి పారిపోయాడు.

Also read :AP News: కొండపై కనిపించిన అరుదైన అద్భుతం.. వెలికితీయగా కళ్లు జిగేల్… వీడియో

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
కదులుతున్న బస్సులో నోట్లో బెడ్ షీట్ కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ అఘాయిత్యం జరిగిందని పేర్కొంది.. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా డయల్ 100కి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన పోలీసులు బస్సును ఛేజ్ చేశారు.. ఈ క్రమంలో తార్నాక దగ్గర ఓయూ పోలీసులు బస్సును అడ్డగించి పట్టుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ఓయు (ఉస్మానియా యూనివర్సిటీ) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Also read :కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి! మన ప్రేమే వాళ్ళ పెట్టుబడి!

Related posts

Share via