SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు

 

రాత్రయింది.. ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏదో నడుస్తోంది.. అమ్మాయిలు వస్తున్నారు.. అబ్బాయిలు అక్కడే ఉన్నారు.. డిజే మార్మోగుతోంది.. లిక్కర్ బాటిళ్లు గలగలలాడుతున్నాయ్.. గంజా గుప్పమన్నది.. అమ్మాయిలు అబ్బాయిలు అంతా మత్తులో తెలుతున్నారు.. సీన్ మొత్తం మారిపోయింది.. మత్తులో తేలుతూ.. గుట్టుచప్పుడు కాకుండా సీన్ నడుస్తోంది..


రాత్రయింది.. ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏదో నడుస్తోంది.. అమ్మాయిలు వస్తున్నారు.. అబ్బాయిలు అక్కడే ఉన్నారు.. డిజే మార్మోగుతోంది.. లిక్కర్ బాటిళ్లు గలగలలాడుతున్నాయ్.. గంజా గుప్పమన్నది.. అమ్మాయిలు అబ్బాయిలు అంతా మత్తులో తెలుతున్నారు.. సీన్ మొత్తం మారిపోయింది.. మత్తులో తేలుతూ.. గుట్టుచప్పుడు కాకుండా సీన్ నడుస్తోంది.. ఈ క్రమంలోనే.. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఇంకేముంది.. సీన్ రివర్స్ అయింది.. హైదరాబాద్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లు అక్రమ దందాలకు ఎలా నిలయంగా మారుతున్నాయో ఈ ఘటన అద్దంపడుతోంది..


రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని ఓ ఫామ్‌ హౌస్‌లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. అంతా మత్తులో ఉండగా మంచాల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ దాడుల్లో 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.2లక్షల 40వేల నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు సీజ్‌ చేశారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచాల పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..



రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి లోని ఫార్మ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మహిళలతో పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు మంచాల పోలీసులు తెలిపారు

Also read

Related posts