June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: మీరు ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకున్నారా? కత్తులు తీసుకునే వస్తున్నారు..జాగ్రత్త.. భయంగొల్పే ఘటన!

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవడం అనేది పెరిగిపోయింది. యాప్‌లలో సులభంగా రుణాలు మంజూరవుతున్నాయి. వివరాలు నమోదు చేయగానే నిమిషాల్లోనే రుణం మంజూరై అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో తీసుకున్న రుణాలకు వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. భారీ మొత్తంలో వడ్డీలు వేస్తూ సమయానికి చెల్లించకుంటే బేధిరింపులు, దాడులకు దిగుతున్నారు. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో తీసుకున్న రూ.6 లక్షల రుణానికి వాయిదాలు చెల్లించకపోవడంతో పేటీఎంలో పనిచేస్తున్న లోన్ ఏజెంట్లు ఓ వ్యక్తిని కత్తితో బెదిరించారు. ఈలోగా చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి పేటీఎం ఏజెంట్లు పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మీర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

అశోక్ అనే వ్యక్తి తన వ్యాపారం ప్రారంభించడానికి Paytm నుండి రుణం తీసుకున్నాడు. అయితే, అతని వెంచర్ పుంజుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీని ఫలితంగా అతను Paytm నుండి తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లింపులను డిఫాల్ట్ చేశాడు. శుక్రవారం పేటీఎం నుండి రుణ ఏజెంట్లు అశోక్ తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తున్న రెస్టారెంట్‌లోకి ప్రవేశించి రుణం తిరిగి చెల్లించాలని పేటీఎం లోన్‌ రికవరీ ఏజెంట్లు కత్తితో బెదిరించారు. ఆ మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తానని అశోక్‌ వారికి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారతదేశం ప్రముఖ చెల్లింపు, ఆర్థిక సేవల పంపిణీ సంస్థ అయిన పేటీఎం ఆర్బీఐ విధించిన నిబంధనల కారణంగా లోన్‌ బాధితులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది.

పేటీఎం దాని రుణ పంపిణీ వ్యాపారంలో సంవత్సరానికి 48 శాతం వృద్ధిని సాధించింది. FY24లో రూ.52,390 కోట్లకు చేరుకుంది. దాని అనుబంధ సంస్థపై నియంత్రణ ఆదేశాల కారణంగా ఫిబ్రవరి 2024లో రూ.9 బిలియన్లకు పడిపోయిన పేటీఎం రుణం పంపిణీ ఏప్రిల్ 2024లో రూ.20 బిలియన్లకు పుంజుకుంది. మేనేజ్‌మెంట్ వెల్లడించిన ప్రకారం, ఫిబ్రవరి-2024లో రూ.9 బిలియన్లకు పడిపోయిన రుణాల చెల్లింపులు ఇప్పుడు ఏప్రిల్ 2024 నాటికి రూ.20 బిలియన్లకు పెరిగాయి. పేటీఎం మనుగడ కోసం దీనికి రుణ పర్యావరణ వ్యవస్థ నుండి బలమైన మద్దతు అవసరం. ఇది మా దృష్టిలో కీలకమైన మానిటర్‌గా మిగిలిపోయిందని పేటీఎం Q4 FY24 ఫలితాలను అనుసరించి Macquarie తెలిపింది

Also read :ఎక్కడినుంచి వస్తార్రా మీరంతా.. నల్లకోడి, గుమ్మడికాయ, ఎర్రని బొమ్మలు.. మధ్యలో ఆహ్వాన పత్రిక..

Related posts

Share via