హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యసై దాడికి యత్నం జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నింగా.. దొంగలు వారిపైనే తిరగబడ్డారు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య గన్మెన్ దగ్గరున్నతుపాకీతో వారిపై కాల్పులు జరిపారు.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చాదర్ఘట్ పీఎస్ పరిధిలో సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యసై దాడి చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లను అడ్డుకునేందుకు వెళ్లిన డీసీపీ గన్మెన్ కిందపడిపోయారు. వెంటనే అతన్ని నుంచి గన్ తీసుకున్న డీసీపీ నిందితులు తప్పించుకోకుండా వాళ్లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
డీసీపీ కాల్పుల్లో ఆ దొంగలు గాయపడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Also read
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?





