SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: భార్య తన మాట వినడం లేదని.. ముగ్గురు పిల్లలతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీయన్‌ రెడ్డి నగర్‌కి చెందిన అశోక్ అనే వ్యక్తి ముగ్గురు పిల్లలను కారులో మార్నింగ్ వాక్ కు తీసుకొచ్చారు. కారుని వేగంగా పోనిచ్చి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కారు చెరువులో మునిగిపోయింది.

Also read :బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీయన్‌ రెడ్డి నగర్‌కి చెందిన అశోక్ అనే వ్యక్తి ముగ్గురు పిల్లలను కారులో మార్నింగ్ వాక్ కు తీసుకొచ్చారు. కారుని వేగంగా పోనిచ్చి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కారు చెరువులో మునిగిపోయింది.

Also read :Telangana: ఇంటి బయట కాపలా కాసిన ఇల్లాలు.. ఇంట్లో భర్తను హత్య చేసిన ప్రియుడు!

చెరువులో తేలియాడుతున్న కారును గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే తాళ్లు, ట్యూబులతో కారు సహా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు పిల్లలు తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారించారు. అయితే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలో పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. స్థానికుడు సాయి అనే వ్యక్తి ధైర్యం చేసి డు సాయంతో ఒక్కొక్కరిగా అందర్నీ బయటకు తీసుకొచ్చారు. సాయిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Also read :HYDలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పేరుతో కొత్త మోసం! మహిళలు జాగ్రత్త!

Related posts

Share this